జగిత్యాల జిల్లా కోరుట్లలో హృదయవిదారక సంఘటన చోటు చేసుకుంది. కోరుట్లలోని ఆనంద్నగర్లో తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ కొడుకు ఇంటి ఎదుట తల్లిదండ్రులు బైఠాయించి, ఆందోళనకు దిగారు. ఆనంద్ నగర్ కు చెందిన గంగాధర సుబ్బయ్య, లక్ష్మి దంపతులకు కొడుకు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కొన్నేళ్లుగా వారి కొడుకు తల్లితండ్రుల పోషణ చూడక పోవడంతో వృద్దదంపతు లు వారి కూతురు ఇంట్లో ఉంటున్నారు. కొన్ని నెలల క్రితం బుచ్చయ్య అనారోగ్యం భారిన పడటంలో లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయి. అప్పు తెచ్చి వైద్యం చేయించుకున్నారు.. ఆ డబ్బులు వాటిని చెల్లించాలని కొడుకు దగ్గరికి వెళ్ళితే వెళ్లగొట్టాడు. వారు పెద్ద మనుషులను ఆశ్రయించారు. కానీ కొడుకు మాత్రం ఇంటికి రానివ్వడం లేదు. కడుపు కాస్త తిండి కుడా పెట్టడం లేదు.
ఇటీవల ఆర్డిఒ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఆర్డిఒ జివాకర్ రెడ్డి కుమారుడు లింగమూర్తి ని పిలిపించి మాట్లాడారు. తల్లితండ్రుల పోషణ చూడాలని వారి ఖర్చులకు నెలకు రూ.3000ల నగదు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికి కుమారుడు పట్టించు కోలేదు. దీంతో వృద్ధ తల్లితండ్రులు చేసేదేమీ లేక కొడుకు ఇంటి ముందు బైఠాయించి, ఆందోళనకు దిగడంతో చుట్టూ పక్కల వారు వచ్చి వారిని చూసి ఆవేదన వ్యక్తం చేశారు. ఎండను సైతం భరించి అక్కడే కూర్చున్నారు. తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడే ఆందోళన కొనసాగిస్తామని తల్లిదండ్రులు చెబుతున్నారు..ఆ కొడుకు మనస్సు మాత్రం కరగడం లేదని, అతడిపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.