Saturday, February 22, 2025

లగచర్ల ఘటన…. పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కొడంగల్ మాజీ ఎంఎల్‌ఎ పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. లగచర్ల ఘటనలో పట్నం నరేందర్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో మాజీ ఎంఎల్‌ఎ బిఆర్‌ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లగచర్ల దాడి ఘటనలో బోగమోని సురేష్ కీలకంగా వ్యవహరించినట్టు పోలీసులు గుర్తించారు. బిఆర్‌ఎస్ నేత బోగమోని సురేష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. లగచర్ల ఘటనలో ఇప్పటివరకు 57 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం రాత్రి 16 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరికొంత మందిని పోలీసులు విచారిస్తున్నారు. లగచర్లలో ఫోన్ కాల్ డేటా పోలీసులు విశ్లేషిస్తున్నారు. సూత్రదారుల వ్యవహారంలో కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు. 16 మంది అరెస్టును ఐజి సత్యనారాయణ ధ్రువీకిరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News