Tuesday, September 17, 2024

సిఎం రేవంత్ రెడ్డిని కలిసిన పవన్‌ కల్యాణ్‌

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో ఎపి ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. బుధవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో సీఎం రేవంత్ ను మర్యాదపూర్వకంగా పవన్ కళ్యాణ్ కలిశారు. ఈ సందర్భంగా సీఎం సహాయనిధికి కోటి రూపాయల చెక్కును రేవంత్ కు పవన్ అందించారు. దీంతో పవన్ కు సిఎం రేవంత్ కృతజ్ఞతలు తెలిపారు.

కాగా.. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు కురిసిన సంగతి తెలిసిందే. భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. కొన్ని గ్రామాలను వరదలు ముంచెత్తడంతో చాలా మంది నిరాశ్రులయ్యారు. తాగడానికి నీళ్లు, తినడానికి ఆహారం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో వరద బాధితులకు అండగా నిలుస్తూ పలువురు సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ కూడా తన వంతుగా తెలంగాణ సిఎం సహాయ నిధికి రూ.కోటి ప్రకటించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News