Thursday, February 13, 2025

ఏపి ఉపముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కు ఉపముఖ్యమంత్రి పదవిని ఇచ్చింది. ఆయనకు పంచాయత్ రాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అడవులు, శాస్త్ర-సాంకేతిక శాఖలను కేటాయించింది.

టిడిపి వర్గాల కథనం ప్రకారం ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు తన కుమారుడు నారా లోకేశ్ కు మానవ వనరుల అభివృద్ధి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్స్ శాఖలను కేటాయించింది. బుధవారం నాయుడు సహా 24 మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. పి. నారాయణకు కీలక శాఖ అయిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖను కేటాయించారు. ఆయన రాజధాని అమరావతి ప్రాంతాభివృద్ధి బాధ్యతలు కూడా తీసుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News