Thursday, October 24, 2024

సోషల్ మీడియాపై కెటిఆర్ భారీగా ఖర్చు చేస్తున్నారు: పిసిసి చీఫ్

- Advertisement -
- Advertisement -

మాజీ మంత్రి కెటిఆర్ పై పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్ తీవ్రంగా మండిపడ్డారు.  హైడ్రా, మూసీ సుందరీకరణపై బిఆర్ఎస్ నాయకులు బురద జల్లుతున్నారని మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు వాస్తవాలకు దగ్గరగా మాట్లాడాలని ఆయన సూచించారు. ప్రజలు కూడా వాస్తవాలను గ్రహించాలన్నారు. పది నెలల్లోనే అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఆయన చెప్పారు. దీన్ని ఓవర్వలేక కెటిఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నాడని పేర్కొన్నారు. ప్రభుత్వంపై బురదజల్లేందుకు సామాజిక మాధ్యమాలపై కేటీఆర్‌ భారీగా ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News