Tuesday, April 29, 2025

నల్లగొండలో మామను చంపిన అల్లుడు

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: భూముల విషయంలో గొడవలు జరగడంతో మామను అల్లుడు హత్య చేసిన సంఘటన నల్లగొండ జిల్లా పెది అడిశర్లపల్లి మండలం పోల్కంపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మాయ మారయ్యతో నారాయణ అనే వ్యక్తికి గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. గొడవలు తారాస్థాయికి చేరుకోవడంతో మారయ్య తలపై రాయితో అల్లుడు మోదడంతో ఘటనా స్థలంలోనే అతడు చనిపోయాడు. పోల్కంపల్లి గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News