Friday, September 20, 2024

జులైలో ఒక్కొక్కరికి రూ.7వేల పింఛన్

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో పింఛను లబ్దిదారులు జులై నుంచి రూ.4వేల పింఛన్ అందుకోనున్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఒకటైన పింఛన్ల పెంపునకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మూడో సంతకం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రూ.౩వేల పింఛన్ అందిస్తుండగా ఇకపై రూ.4వేలు అందించనున్నారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలోటిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఈ పథకానికి పెట్టిన ఎన్‌టిఆర్ భరోసా పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగనుంది. తాము అధికారంలోకి వస్తే ఏప్రిల్ నుంచి నెలకు రూ.4వేల పింఛను ఇస్తామని టిడిపి హామీ ఇచ్చింది. ఈ నేపధ్యంలో జులై 1న ఒక్కొక్కరికి రూ.7వేల పింఛను అందిస్తారు.

ఏప్రిల్, మే, జూన్ నెలల్లో చెల్లించాల్సిన ఒక్కో వెయ్యి రూపాయలతో పాటు జులై నెల పింఛను రూ.4వేలు కలిపి మొత్తం రూ.7వేలు అందిస్తారు. ఆగస్టు నెల నుంచి మాత్రం రూ.4వేల చొప్పున పంపిణీ చేస్తారు. రూ.4వేల పింఛను అందుకునే లబ్దిదారుల్లో వితంతువులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్సకారులు, చర్మకారులు, డప్పు కళాకారులు, హిజ్రాలు, హెచ్‌ఐవీ బాధితులు, కళాకారులు ఉన్నారు. దివ్యాంగులకు ప్రస్తుతం రూ.౩వేలు ఇస్తుండగా ఇకపై రూ.6వేలు ఇవ్వనున్నారు. పూర్తిస్థాయిలో అస్వస్థతకు గురైన వారికి, అనారోగ్యంతో మంచాన పడిన వారికి, డయాలసిస్ స్టేజ్‌కు ముందున్న కిడ్నీ రోగులకు ఇస్తున్న రూ.5వేల పింఛనుకు బదులు రూ.10వేలు ఇవ్వాలని నిర్ణయించారు. కుష్టువ్యాధి కారణంగా వైకల్యం పొందినవారికి రూ.6వేలు ఇస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News