Saturday, September 28, 2024

పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్

- Advertisement -
- Advertisement -

డైనమిక్ హీరో శర్వానంద్ తన ల్యాండ్‌మార్క్ 35వ మూవీ ’మనమే’తో హోల్సమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించడానికి రెడీగా వు న్నారు. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆది త్య దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యా నర్‌పై రామ్‌సే స్టూడియోస్ ప్రొడక్షన్‌లో నిర్మాత టిజి విశ్వప్రసాద్ అత్యంత గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ’మనమే’ జూన్ 7న థియేటర్లలో గ్రాం డ్‌గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరోయిన్ కృతి శెట్టి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు సుభ ద్ర.

ఇప్పటి వరకూ నేను చేసిన క్యారెక్టర్స్ కి డిఫరెంట్ గా వుంటుంది. నాకు చాలా కొత్తగా వుం టుంది. ఇప్పటివరకూ క్యూట్, సాఫ్ట్, బబ్లీ క్యారెక్టర్స్ చేశాను. కానీ ఈ క్యారెక్టర్ చాలా స్ట్రిక్ట్ గా వుంటుంది. – శర్వానంద్ ప్రతి సీన్‌లో అద్భుతం గా నటించారు. ఇందులో నాకు ఓ ఫేవరట్ సీన్ వుంది. ఆ సీన్ ఎలా చేయాలో అని చాలా అలోచించాను. కానీ శర్వానంద్ చాలా కాజ్యువల్‌గా వచ్చి ఆ సీన్‌ని ఒక్క నిమిషంలో అద్భుతంగా చే శారు. నేను ఆశ్చర్యపోయాను. ‘మనమే’ స్ట్రాంగ్ ఎమోషన్ కనెక్ట్ వున్న ఎంటర్‌టైనింగ్ ఫిల్మ్. ఈ సినిమా మా ముగ్గురి క్యారెక్టర్స్ చుట్టూ వుం టుంది. అందుకే మనమే అనే పేరు పెట్టాం. ఇది పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. అందరికీ కనెక్ట్ అవుతుంది”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News