Sunday, February 23, 2025

భార్య వెళ్లిందనే మనస్తాపం.. తల్లి సమాధి ముందు భర్త ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: ఇంట్లో నుంచి భార్య విడిచి వెళ్లిపోయిందనే మనస్తాపంతో భర్త ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన రంగారెడ్డి జిల్లాలోని ఫరూక్ నగర్ మండలం కొండన్న గూడలో శనివారం చోటుచేసుకుంది. మృతుడిని రాజుగా గుర్తించారు. మూడు రోజుల క్రితం రాజు భార్య శ్వేత ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.

దీంతో మనస్తాపంతో పొలంలో తల్లి సమాధి వద్ద పురుగుల మందు తాగాడు. ఆత్మహత్యకు ముందు రాజు సెల్ఫీ వీడియో తీశాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి వెళ్లి చూసేసరికి రాజు చనిపోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News