Wednesday, October 16, 2024

పవన్‌కల్యాణ్‌పై హైదరాబాద్ సిటి సివిల్ కోర్టులో పిటిషన్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తిరుపతి లడ్డూపై ఎపి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని హైదరాబాద్ సిటి సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది ఇమ్మినేని రామారావు సోమవారం పిటిషన్ వేశారు. ‘హిందువుల మనోభావాలు దెబ్బతినేలా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఉన్నాయి. శాస్త్రీయమైన ఆధారాలు ఏవీ లేకుండా తిరుపతి లడ్డూలో జంతు మాంసంతో చేసిన నెయ్యి కలిసిందని పవన్ వ్యాఖ్యా నించారు. డిప్యూటీ సిఎంగా ఉన్న పవన్ తన హోదా మరిచి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పవన్ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు సైతం తప్పుబట్టింది. ఇంటర్నెట్‌లో పవన్ మాట్లాడిన వీడియోలు డిలీట్ చేయాలి. తిరుపతి లడ్డూ వివాదంలో సమగ్ర దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఇప్పటికే స్వతంత్ర సిట్ ఏర్పాటు చేసింది. మరోసారి తిరుపతి ప్రసాదంపై పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాలి’ అని పిటిషనర్ తన పిటిషన్‌లో కోర్టును కోరారు. ఈ పిటిషన్‌ను సిటి సివిల్ కోర్టు మంగళవారం విచారించనుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News