Saturday, February 22, 2025

దసరా సందర్భంగా ఆ ప్రతిజ్ఞ చేద్దాం: పొన్నం

- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంత్రి పొన్న ప్రభాకర్ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. సగటున దేశ వ్యాప్తంగా సంవత్సరానికి లక్షా 60 వేల మంది రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నారని, తెలంగాణలో సగటున రోజుకు 20 మంది రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నారని తెలియజేశారు. చెడుపై మంచి విజయం సాధించిన దానికి గుర్తుగా కుటుంబ సభ్యులతో కలిసి దసరా వేడుకలు జరుపుకుంటామని, ఈ వేడుకలో భాగంగా ఆయుధపూజ చేసే సమయంలో ఒక ప్రతిజ్ఞ చేద్దామని పిలుపునిచ్చారు. ట్రాఫిక్ రూల్స్ పాటిద్దామని, హెల్మెట్ , సీటు బెల్టు పెట్టుకుందామని, మద్యం తాగి వాహనం నడపరాదు అని,  ఇది ప్రమాదానికి సూచిక అని తెలిపారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News