Saturday, September 28, 2024

రైతులకు శుభవార్త.. త్వరలో పిఎం కిసాన్‌ నగదు జమ

- Advertisement -
- Advertisement -

దేశవ్యాప్తంగా రైతులకు గుడ్ న్యూస్..  త్వరలోనే పీఎం కిసాన్ పథకం 18వ విడత డబ్బులు రైతుల ఖాతాలో జమ కానున్నాయి. అక్టోబర్ 5న పిఎం కిసాన్ నిధులను కేంద్రం విడుదల చేయనుంది. జూన్ 18న రైతులకు ఖాతాల్లో 17వ విడత నిధులు జమ చేసిన సంగతి తెలిసిందే.  ఇక, వచ్చే నెల 5న ప్రధాని మోడీ చేతుల మీదుగా 18వ విడత ప్రారంభం కానుంది. ఆ రోజు రైతుల ఖాతాల్లోకి రూ.2వేలు చొప్పున నగదును కేంద్రం జమ చేయనుంది. కాగా, 2019లో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది రైతులకు కేంద్రం రూ.6 వేల సాయాన్ని మూడు విడతల్లో అందిస్తున్నది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News