Saturday, July 6, 2024

నేడు కన్యాకుమారికి మోదీ.. 2వేల మంది పోలీసులు పహారా

- Advertisement -
- Advertisement -

ప్రధాని నరేంద్ర మోదీ గురువారం తమిళనాడులోని కన్యాకుమారికి వెళ్లనున్నారు. స్వామి వివేకానంద రాక్ మెమోరియల్‌లో ఈరోజు సాయంత్రం నుంచి జూన్ 1న మధ్యాహ్నం 3 గంటల వరకు ధ్యానంలో కూర్చోనున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 2వేల మంది పోలీసులు పహారా కాయనున్నారు. గత ఎన్నికల్లో ప్రచారం ముగిసిన అనంతరం కూడా మోదీ కేదార్‌నాథ్ గుహలో ధ్యానం చేసిన సంగతి తెలిసిందే.

ప్రధాని మోదీ.. వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గరే ధ్యానం చెయ్యడానికి ప్రత్యేక కారణం ఉంది. పురాణాల ప్రకారం అక్కడున్న రాయిపై కన్యాకుమారి దేవి తపస్సు చేసింది. అలాగే.. ఆ రాయి, వివేకానందస్వామి జీవితంపై కూడా మంచి ప్రభావం చూపిందనీ అందుకే ప్రధాని మోదీ ఆ రాయిపై ధ్యానం చెయ్యాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News