Monday, July 1, 2024

హుక్కా పార్లర్‌పై పోలీసుల దాడి.. 9మంది అరెస్టు

- Advertisement -
- Advertisement -

నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న హుక్కా పార్లర్‌పై వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. దాడుల్లో 9మంది యజమానులు, ఉద్యోగులు, 15మంది కస్టమర్లను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…ఎండి అబ్దుల్ లతీఫ్‌ఖాన్, మడ్డె శ్యాంసుందర్, ఎండి అశ్వక్, ఎండి అస్లాం, నందకిషోర్ ధాన్, మాల్యా కుమార్ ధాన్, దీపక్ సాహో, అల్తాఫ్ రేజా, రాణి కోస్లాను అరెస్టు చేశారు.

వారి వద్ద నుంచి హుక్కాకు సంబంధించిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పంజాగట్టు పోలీస్ స్టేషన్ పరిధిలో మియామి గల్లీ కేఫ్ పేరుతో హుక్కా సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. హుక్కా సెంటర్‌లో నిషేధిత ప్లేవర్లు వాడుతున్నారనే సమాచారం పోలీసులకు వచ్చింది. దీంతో దాడి చేసి అరెస్టు చేశారు. ఇన్స్‌స్పెక్టర్ జంగయ్య, ఎస్సై రంజిత్‌కుమార్, నవీన్, అరవిద్‌గౌడ్ తదితరులు దాడి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News