- Advertisement -
ఢిల్లీ: గుర్తు తెలియని దుండగులు మహిళ ఎస్ఐను తుపాకీతో కాల్చి చంపిన సంఘటన ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ప్రీతి అనే అమ్మాయి పాట్ పర్ గంజ్ పారిశ్రామిక వాడలో పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తోంది. రోహిణి ప్రాంతం నుంచి ప్రీతి తన ఇంటికి వెళ్తుండగా ఆమెపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. అనంతరం దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు వెల్లడించారు. ఐదు ఆరు చోట్ల బుల్లెట్ గాయాలతో ఆమె దుర్మరణం చెందిందని వైద్యులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -