మనతెలంగాణ/సిటీబ్యూరో:హైదరాబాద్ స్థానిక సం స్థల ఎమ్మెల్సీ స్థానానికి బుధవారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని ఎన్నికల రిటర్నింగ్ అ ధికారి అనురాగ్ జయంతి తెలిపారు. ఉదయం 8 గం .ల నుండి సా. 4 గం.ల వరకు పోలింగ్ నిర్వహించగా, మధ్యాహ్నం 2 గంటల వరకే 78.57 శాతం ఓట్లు పో ల్ అయ్యాయని తెలిపారు. జీహెచ్ఎంసీ ప్రధాన కా ర్యాలయంలో ఏర్పాటు చేసిన రెండు పోలింగ్ కేం ద్రాల్లో మొత్తం ఓటర్లు 112 మందిలో 88మంది ఓట ర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.మొత్తం 112 ఓటర్లలో ఎక్స్ అఫిషియో మెంబర్లు 31 కాగా, అందులో 22 మంది ఓటు హక్కును వినియోగించుకు న్నారు. 81 మంది కార్పొరేటర్ల లో 66 మంది ఓటు హ క్కు వినియోగించుకున్నారు.’
ఉదయం 8 గంటల నుం డి 10 గంటల వరకు 37.51 శాతం పోలింగ్ నమోదు కాగా, మధ్యాహ్నం 12 గంటల వరకు 77.68 శాతం, మధ్యాహ్నం 2 గంటల వరకు 78.57 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. సా. 4 గం.ల వరకు 78.57 శా తం పోలింగ్ జరిగిందని తెలిపారు. ఎన్నికల పరి శీలకులు సురేంద్ర మోహన్ రిటర్నింగ్ అధికారితో కలిసి పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను రిసెప్షన్ సెంటర్ కు బందోబస్తు మధ్య తీసుకువచ్చారు. వాటిని స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. స్ట్రాంగ్ రూం వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నెల 25న ఉద్యం 8 గం.లకు ఓట్ల లెక్కింపు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని పన్వర్ హాల్ లో నిర్వహించడం జరుగుతుందని రిటర్నింగ్ అధికారి వెల్లడించారు.