హైదరాబాద్: సంప్రదాయ పద్ధతిలో రాజ్భవన్లో ఘనంగా పొంగల్ వేడుకలను జరుపుకున్నారు. ఈ వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో పాటు ఆమె కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ పొంగల్ వంటకాన్ని తయారు చేసి అందరికీ పంచిపెట్టారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్భంగా ఆమె దేవుడిని ప్రార్థించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రకృతికి మనం రుణపడి ఉన్నామని, సమృద్ధి, ఆరోగ్యం, శ్రేయస్సులో బాగున్నామంటే దానికి కచ్చితంగా ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పాల్సిందేనన్నారు. ముందుగా ఫ్రంట్లైన్ యోధులకు తగిన ప్రాధాన్యత ఇవ్వడంలో భాగంగా వారికి వ్యాక్సిన్లను ఇవ్వాలని నిర్ణయించడం సంతోషించదగ్గ విషయమన్నారు. టీకా అభివృద్ధి చేసిన మన శాస్త్రవేత్తలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. టీకా, ఆత్మనిర్భర్కు సంబంధించి సందేశాలతో కూడిన గాలిపటాలను గవర్నర్ ఎగురవేశారు.
Pongal celebrations in Raj Bhavan