Tuesday, September 17, 2024

లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించి… పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయండి: పొంగులేటి

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరద ముప్పు పరిస్థితులపై ఆదివారం ఉదయం నుంచి జిల్లా కలెక్టర్లు, డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులతో రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్షిస్తున్నారు. ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్, సూర్యాపేట, నల్గొండ, హైదరాబాద్ తదితర జిల్లాలో నెలకొన్న పరిస్థితులను మంత్రి అధికారులును అడిగి తెలుసుకున్నారు.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేశారు. వరద ముప్పు ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మారం చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని.. అవసరమైన ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని అధికారును సూచించారు.

రెస్కూటీమ్‌లు, ఎన్డీఆర్‌ఎఫ్‌. బృందాలు, అవసరమైతే రక్షణ చర్యలకు హెలికాప్టర్లు వినియోగించాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు. విపత్తుల నిర్వహణ విభాగం అధికారులు, సిబ్బంది 24 గంటల పాటు సచివాలయంలో అందుబాటులో ఉండాలని చెప్పారు. విద్యుత్, తాగునీటికి, రాకపోకలకు అంతరాయాలు కలుగుకుండా చూసుకోవాలన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో నెలకొన్న పరిస్థితులపై ఆ జిల్లా కలెక్టర్ ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. తక్షణమే అక్కడ సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎలాంటి ప్రాణా నష్ట, ఆస్తి నష్టం చేరకుండా తక్షణం చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి అధికారులు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News