Sunday, September 8, 2024

రైతు రుణమాఫీ… కలనా? నిజమా?: పొన్నం

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: దేశంలోనే మొదటిసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసింది తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశంసించారు. నిన్ననే రైతు రుణమాఫీ చేయడానికి నాయకత్వం వహించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ధన్యవాదాలు తెలిపారు. భారత దేశ చరిత్రలో మే 6 వ తేది 2022 లో ఇచ్చిన హామీని రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుందని పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లాలో అనంతరం రెడ్డి పంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన రైతుల సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రసంగించారు. ఇది కలనా నిజమా అని రైతులు అనుకుంటున్నారని, గత ప్రభుత్వం లక్ష రూపాయలు రుణమాఫీని నాలుగు, ఐదు విడుతలలో చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష రూపాయలు రుణమాఫీ ఒకసారి తరువాత లక్ష 50 వేలు, తరువాత 2 లక్షల రుణమాఫీ ఒకేసారి జరుగుతుందన్నారు. ఆయిల్ ఫామ్ కు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్న అన్ని ఖర్చులూ పొగ లక్షల్లో ఆదాయం వస్తుందని, ఆయిల్ ఫామ్ లో అంతర పంటలు వేసుకోవచ్చని సూచించారు.

2 లక్షల 103 మెట్రిక్ టన్నుల ఆయిల్ మార్కెట్ జరుగుతుంటే బయటి దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నామని, రాష్ట్రంలో 2 లక్షల ఎకరాల పైన ఆయిల్ ఫాం పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, పెద్దపల్లి జిల్లాలో 45 వేల ఎకరాల్లో ఆయిల్ ఫాం పెట్టడానికి ఇక్కడ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరినీ ఏర్పాటు చేస్తున్నామన్నారు.  కొత్త బస్సులకు పెద్ద ఎత్తున డిమాండ్స్ వస్తున్నాయని, చాలా చోట్ల కొత్త బస్సులు ఏర్పాటు చేస్తున్నామని, రేవంత్ రెడ్డి నాయకత్వంలోమూడు వేలకు పైగా నియామకాలకు ఆదేశాలు జారీ చేశామని, ఇప్పటికే వెయ్యికి పైగా బస్సులు కొనుగోలు చేశామని, మరో 1500 బస్సులు కొనుగోలు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.

ఆర్థిక పరిపుష్టి శక్తి రైతన్న దగ్గరే ఉందని, రైతన్నలకు ఆర్థిక శక్తిగా ఎదగాలని, డిసెంబర్ 3 న గెలిచామని, 7 న మంత్రిగా ప్రమాణం చేశానని, 9న ఆర్టీసిలో మహిళలకు ఉచిత బస్సు అందించామని మంత్రి పొన్నం వివరించారు.  ఇప్పటి వరకు 62 కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేశారని, 2100 కోట్లకు పైగా ఆర్టిసికి ప్రభుత్వం చెల్లించిందని, మహాలక్ష్మి పథకంతో ఆర్టిసి నష్టాలు లేకుండా నడుస్తుందని, పెద్దపల్లిలో ఆర్టిసి బస్సు డిపో ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గోదావరి ఖని బస్సు స్టాండ్ రూపురేఖలు మారుస్తామని, ఆర్టిసి ఉద్యోగులకు పిఆర్సి ఇచ్చామని, 2013 నాటి పెండింగ్ బాండ్లు చెల్లించామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News