Tuesday, September 17, 2024

ప్ర‌భాస్ అభిమానులు శుభవార్త..

- Advertisement -
- Advertisement -

‘బాహుబలి’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్. భారీ యాక్షన్ మూవీ ‘సాహో’ తో మరోసారి ఫ్యాన్స్‌ అలరించాడు. ముఖ్యంగా హిందీ అభిమానులను ఆకట్టుకున్న ‘సాహో’ అక్కడ ఏకంగా 150 కోట్లు వసూల్ చేసి స్తతా చాటింది. ఈ సినిమాలతో దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ప్రభాస్ సినిమాలు ఇకనుంచి పాన్ ఇండియా మూవీస్ గా తెరకెక్కనున్నాయి. ప్రస్తుతం ప్రభాస్, ‘జిల్’ ఫేం రాధా కృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేస్తున్నాడు.  ఈ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా, ప్రభాస్ ఫ్యాన్స్‌కు చిత్రయూనిట్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్ర‌భాస్ 20వ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీకి సంబంధించిన టైటిల్, ఫ‌స్ట్ లుక్ పోస్టర్ ఈనెల 10వ తేదీ ఉద‌యం 10 గంట‌ల‌కు విడుదల చేయ‌నున్న‌ట్టు చిత్ర నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ ట్వీట్టర్ ద్వారా ప్రకటించింది. దీంతో ఆ రోజు ప్ర‌భాస్ అభిమానులకు పండగనే చెప్పాలి. కాగా, పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన అందల భామ పూజా హెగ్డే నటిస్తోంది. ఈ మూవీ పిరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇప్పటికే సగానికిపైగా చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా మిగతా షూటింగ్ వాయిదా పడింది.

Prabhas 20th movie Title and First Look to out on July 10

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News