Monday, April 28, 2025

కేంద్ర బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన రాష్ట్రపతి

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: కేంద్ర బడ్జెట్ 2024-25 ప్రవేశ పట్టడానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. అనంతరం బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాష్ట్రపతి స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బడ్జెట్ ట్యాబ్లెట్‌తో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన పార్లమెంట్‌కు చేరుకున్నారు. కేంద్ర బడ్జెట్‌ను ఆమోదించడానికి ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్రమంత్రి వర్గం పార్లమెంట్‌లో సమావేశమైంది.

భారత దేశాన్ని అభివృద్ధి, ప్రగతి పథంలో నడిపించే విధంగా ఈ బడ్జెట్ ఉంటుందని కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా తెలిపారు. ఈ బడ్జెట్ అనేది ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ఆకాంక్షలకు అనుగుణంగా తయారు చేయడంతో పాటు వికసిత్ భారత్ లక్షంగా ముందుకు వెళ్తామని సింధియా స్పష్టం చేశారు.

President Droupadi Murmu approved Union Budget

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News