- Advertisement -
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ వికెట్ల నష్టానికి పరుగులు చేసింది. పంజాబ్ ఓపెనర్లు ప్రభ్ సిమ్రన్ సింగ్, ప్రియాంశ్ ఆర్య మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ప్రియాంశ్ ఆర్య(36: 13 బంతుల్లో 4సిక్స్ లు, 2 ఫోర్లు) హర్షల్ పటేల్ బౌలింగ్ లో నితీశ్ రెడ్డికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఎషాన్ మలింగ బౌలింగ్ లో ప్రభ్ సిమ్రన్ సింగ్(42: 23 బంతుల్లో 5 సిక్స్ లు, 2 ఫోర్లు) ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ 22 బంతుల్లోనే హఫ్ సెంచరీ చేశాడు. శ్రేయస్ అయ్యర్ (86:36 బంతుల్లో 6 ఫోర్లు,6 సిక్స్ లు),నేహాల్ వధేరా(27), మార్కస్ స్టాయినీస్ (34) పరుగులు చేశారు.
- Advertisement -