- Advertisement -
లక్నో: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా అటల్ బిహారీ వాజ్పేయ్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుపై ఘన విజయం సాధించిన ఉత్సహంతో ఉన్న లక్నో జట్టు ఈ మ్యాచ్లోనూ అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. ఇక తొలి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ని ఓడించిన పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్ని కూడా దక్కించుకోవాలని పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టులోకి లాకీ ఫెర్గుసన్ అరంగేట్రం చేస్తుండగా.. లక్నో అదే జట్టుని కొనసాగిస్తోంది.
- Advertisement -