Saturday, April 12, 2025

రాజస్థాన్‌పై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్

- Advertisement -
- Advertisement -

ముల్లాన్‌పూర్: ఐపిఎల్‌లో భాగంగా మహరాజా యాదవేంద్ర సింగ్ క్రికెట్ స్టేడియం వేదికగా.. రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఆడిన రెండు మ్యాచుల్లో విజయం సాధించిన పంజాబ్ జట్టు ఈ మ్యాచ్‌లోనూ  రాజస్థాన్‌ను చిత్తు చేసే ప్రయత్నంలో ఉంది. ఇక చెన్నై సూపర్‌ కింగ్స్‌పై విజయంతో జోష్‌లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ అదే జోరును ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఎలాంటి మార్పు లేకుండా బరిలోకి దిగుతుండగా.. రాయల్స్ ఒక మార్పు చేసింది. తుషార్ దేశ్‌పాండే స్థానంలో యుద్వీర్‌ని జట్టులోకి తీసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News