Wednesday, October 16, 2024

పూరీ జగన్నాథ ఆలయంలోని ‘మహాప్రసాదం’ త్వరలో భక్తులకు ఉచితం

- Advertisement -
- Advertisement -

‘మహాప్రసాదం’ను ఉచితంగా పంపిణీ చేయడం వల్ల ప్రభుత్వానికి ఏడాదికి రూ.14-15 కోట్ల అదనపు వ్యయం కాగలదు.

భువనేశ్వర్: పూరీలోని జగన్నాథ ఆలయంలోని ‘మహాప్రసాదాన్ని’ భక్తులకు ఉచితంగా పంపిణీ చేసేందుకు ఒడిశా ప్రభుత్వం యోచిస్తోందని ఆ రాష్ట్ర మంత్రి ఆదివారం తెలిపారు. ప్రణాళికాబద్ధమైన చర్య త్వరలో సాకారం కాగలదని ఒడిశా న్యాయ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ ఇక్కడ విలేకరులతో అన్నారు. ‘మహాప్రసాదం’  ఉచితంగా పంపిణీ చేయడం వల్ల ప్రభుత్వానికి ఏడాదికి రూ.14-15 కోట్ల అదనపు వ్యయం అవుతుందని హరిచందన్ అన్నారు. పవిత్ర ఒడియా ‘కార్తీక’ మాసం (రెండు నెలలు) తర్వాత అమలు ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News