Sunday, February 23, 2025

డ్రోన్లపై నిషేధం…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దేశ ప్రధాన మంత్రి పర్యటన నేపథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రోన్లు, ప్యారా గ్లైడర్లపై నిషేధం విధిస్తూ పోలీస్ కమిషనర్ అరుణ్ జోషి ఆదేశాలు జారీ చేశారు. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 15వ తేదీన మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రతా పరమైన చర్యలు తీసుకున్న రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి డ్రోన్లు, రిమోట్ కంట్రోల్డ్ మైక్రో లైట్ ఎయిర్ క్రాఫ్ట్‌లు, ఎయిర్ బెలూన్ల ఎగురవేతపై నిషేధం విధించారు. నిషేదాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి హెచ్చరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News