Tuesday, April 1, 2025

ఇండియాలో అత్యంత శక్తివంతమైన నేతలుగా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు ఎదగడం గర్వకారణం

- Advertisement -
- Advertisement -

టిపిసిసి జనరల్ సెక్రటరీ, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్
మనతెలంగాణ/హైదరాబాద్: భారతదేశంలో అత్యంత శక్తి వంతమైన నేతలుగా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు ఎదగడం గర్వకారణమని టిపిసిసి జనరల్ సెక్రటరీ, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ పేర్కొన్నారు. ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ, సిఎం రేవంత్ రెడ్డిలకు కాంగ్రెస్ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే టిపిసిసి జనరల్ సెక్రటరీ, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వీడియో విడుదల చేశారు. దేశంలో ప్రతిపక్ష నేత గా ఎన్నో కష్టాలను ఓర్చుకొని కాంగ్రెస్‌కు సేవచేస్తూ 9వ ర్యాంక్ సాధించిన రాహుల్ గాంధీకి, సంవత్సరం క్రితమే ముఖ్యమంత్రి అయి శక్తివంతమైన నేతగా ఎదిగి కాంగ్రెస్‌కు పేరు తీసుకొస్తున్న రేవంత్ రెడ్డికి ఆయన అభినందనలు తెలియజేశారు.

అలాగే కాంగ్రెస్ పార్టీ నీతిగా, నిజాయితీగా ప్రజలకు సేవ చేస్తున్నందునే ఇది సాధ్యం అయిందని ఆయన తెలిపారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ 2025 సంవత్సరానికి గానూ 100 మంది ప్రముఖులతో భారతదేశంలోని అత్యంత శక్తిమంతుల జాబితా విడుదల చేసింది. ప్రధాని మోడీ అగ్రస్థానం దక్కించుకోగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ 9వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు 14వ స్థానంలో ఉండగా రేవంత్ రెడ్డి 28వ స్థానంలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News