Sunday, September 8, 2024

‘జమిలి’ అంటే రాష్ట్రాలపై దాడి చేయడమే : రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాల అధ్యయనం కోసం కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి నేతృతంలో ఏర్పాటు చేసిన కమిటీపై కాంగ్రెస్ మరోసారి అనుమానాలు వ్యక్తం చేసింది. అంతేకాకుండా జమిలీ ఎన్నికల ఆలోచన భారత ఐక్యత, రాష్ట్రాలపై దాడి చేయడమేనని మండిపడింది. ముఖ్యంగా కమిటీ ఏర్పాటు చేసిన సమయం, విధివిధానాలను నిర్దేశించిన తీరును చూస్తుంటే సిఫార్సులు కూడా ఇప్పటికే నిర్ణయించినట్టు ఆరోపించింది.

కమిటీ కూర్పు పైనా అనుమానాలు ఉన్నాయని, అందులో ఉండేందుకు తమ నేత నిరాకరించారని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ‘ఒకే దేశంఒకేసారి ఎన్నికలు… భారత్ ఐక్యత, అన్నిరాష్ట్రాలపై దాడి చేసే ఆలోచనే ’ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. భారత్ అంటే రాష్ట్రాల సమైక్యత అన్నారు. ‘జమిలి ఎన్నికలపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయడం నామమాత్రపు ప్రక్రియే. దీన్ని ఏర్పాటు చేసిన సమయం పైనా అనుమానాలున్నాయి. దాని నియమ నిబంధనలను చూస్తే కమిటీ సిఫార్సులను ఇప్పటికే నిర్ణయించినట్టు తెలుస్తోంది.

అందుకే కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి ఆ కమిటీలో ఉండేందుకు నిరాకరించడం సరై నదే అని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ పేర్కొన్నారు. ఇక ఒకేసారి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఛైర్మన్‌గా 8 మంది ప్రముఖులతో ఓ కమిటీ ఏర్పాటైంది. వెంటనే పని ప్రారంభించి సాధ్యమైనంత త్వరగా సిఫార్సులు చేయాలని కమిటీకి సూచించింది. అయితే ఇందుకు స్పష్టమైన గడువు మాత్రం నిర్దేశించలేదు.

సమావేశాలు, ఇతర కార్యక్రమాలకు సంబంధించిన విధివిధానాలను అదే రూపొందించుకోవచ్చని, ఇది ప్రజల సూచనలనూ వింటుందని తాజా గెజిట్‌లో పేర్కొంది. వినతులు, లేఖలు స్వీకరించి అవసరమైన వాటిని తుది సిఫార్సుల్లో పొందుపరచడానికి వీలు కల్పించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News