Sunday, April 27, 2025

మరో యాత్రకు సిద్ధమైన రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో యాత్రకు సిద్ధమయ్యారు. భారత్ న్యాయ యాత్ర పేరిట 14 రాష్ట్రాల్లో పర్యటించేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ భారత్ జోడో యాత్ర చేసి, పార్టీకి జవసత్వాలు చేకూర్చిన రాహుల్  ఇప్పుడు న్యాయయాత్ర పేరిట మణిపూర్ నుంచి ముంబై వరకూ బస్సులోనూ, కాలినడకన పర్యటించనున్నారు. న్యాయయాత్ర జనవరి 14న ప్రారంభమై, మార్చి 20న ముగుస్తుంది. గతంలో రాహుల్ చేసిన భారత్  జోడో యాత్ర 145 రోజులపాటు కొనసాగింది. రాహుల్ 3970 కిలోమీటర్లు పాదయాత్ర జరిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News