Tuesday, September 17, 2024

కరోనా వ్యాక్సిన్ పంపిణీపై ప్రధాని వైఖరి చెప్పాలి…

- Advertisement -
- Advertisement -

Rahul Gandhi Question On Centre's Stand On Covid

న్యూఢిల్లీ: కొవిడ్-19 వ్యాక్సిన్‌ను దేశ ప్రజలందరికీ అందచేస్తామని తాము ఎప్పుడూ చెప్పలేదంటూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. కేంద్రం ప్రకటనపై ప్రధాని నరేంద్ర మోడీ వైఖరేమిటో స్పష్టం చేయాలని ఆయన డిమాండు చేశారు. వైరస్ సంక్రమణ గొలుసు తెంపడానికి కొందరికి వ్యాక్సిన్ ఇస్తే చాలని, దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. అంతేగాక ప్రజలందరికీ వ్యాక్సిన్ వేస్తామని తాము ఎన్నడూ చెప్పలేదని కూడా కేంద్రం స్పష్టం చేసింది. దీనిపై రాహుల్ బుధవారం ఒక ట్వీట్ చేస్తూ దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ లభిస్తుందని ప్రధాని మోడీ చెప్పారని గుర్తు చేశారు. బీహార్ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని బీహార్ ఎన్నికల్లో బిజెపి వాగ్దానం చేసిందని ఆయన అన్నారు. దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇస్తామని తాము ఎన్నడూ చెప్పలేదని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కేంద్రం ప్రకటించిందని ఆయన తెలిపారు. ప్రధాని ఏ వైఖరికి కట్టుబడి ఉంటారో స్పష్టం చేయాలని రాహుల్ డిమాండు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News