Monday, February 3, 2025

10వ రోజుకు చేరిన రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర‘

- Advertisement -
- Advertisement -

 

Rahul Gandhi

కాయంకుళం(కేరళ): కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ శనివారం పదో రోజు ‘భారత్‌ జోడో యాత్ర’ను కరుణాగపల్లి సమీపంలోని పుతియకావు జంక్షన్‌ నుంచి వేలాది మంది పార్టీ కార్యకర్తలతో కలిసి పార్టీ జెండాలు ఊపుతూ ప్రారంభించారు. రాహుల్ గాంధీ, యాత్ర సభ్యులు శుక్రవారం 24 కిలోమీటర్ల మేర నడిచిన తర్వాత కరునాగపల్లి వద్ద ఆగిపోయారు.

ఉదయం 6.30 గంటల తర్వాత తిరిగి ప్రారంభమైన యాత్ర దాదాపు 12 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అలప్పుళ  జిల్లాలోకి ప్రవేశించి ఉదయం 11 గంటలకు కాయంకుళం వద్ద విరామం తీసుకుంటుంది. ఇది సాయంత్రం 5 గంటలకు తిరిగి ప్రారంభమవుతుంది,  చెప్పాడ్‌లో బహిరంగ సభతో ముగుస్తుంది. కాంగ్రెస్ సీనియర్ నేతలు కొడిక్కున్నిల్ సురేశ్ , కె. మురళీధరన్, కెసి.వేణుగోపాల్, రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత విడి. సతీశన్ తదితరులు రాహుల్ గాంధీ వెంట ఉన్నారు.

ఇదిలావుండగా శుక్రవారం రాత్రి కరునాగపల్లి సమీపంలోని ఆశ్రమంలో ఆధ్యాత్మిక నాయకురాలు మాతా అమృతానందమయిని రాహుల్ గాంధీ కలిశారు. అమృతానందమయితో దిగిన చిత్రాలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్  కూడా గాంధీ, అమృతానందమయి చిత్రాన్ని ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News