Sunday, February 23, 2025

రైళ్లను పట్టాలు తప్పించే కుట్రలపై రైల్వే శాఖ అప్రమత్తం: అశ్వినీ వైష్ణవ్

- Advertisement -
- Advertisement -

జైపూర్: రైళ్లు పట్టాలు తప్పేలా సాబటేజ్ ప్రయత్నాలు ఇటీవల వెలుగుచూశాయి. పట్టాలపై ఎల్ పిజి సిలిండర్లు, సైకిళ్లు, ఇనుపరాడ్లు, సిమెంటు ఇటుకలు పెట్టి రైళ్లకు ప్రమాదం తలపెట్టే ఘటనలు వెలుగుచూస్తున్నాయి. వీటి విషయంలో రైల్వే శాఖ అప్రమత్తంగా ఉందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు అనేక రాష్ట్రాల యంత్రాంగం, పోలీసులతో చర్చలు జరుపుతున్నామన్నారు. రైలు ప్రమాదాలకు యత్నించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News