Sunday, September 8, 2024

కొత్త రైళ్లను పట్టాలేక్కించనున్న రైల్వేశాఖ

- Advertisement -
- Advertisement -

Railway Board approval to zones for 39 new trains

న్యూఢిల్లీ: దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ మరో 39 సర్వీసులు నడిపేందుకు అన్ని జోన్లకు అనుమతులు ఇచ్చింది. దక్షిణ మధ్యరైల్వే పరిధిలో 4 రైళ్లకు అనుమతి లభించింది. సికింద్రాబాద్-శాలిమార్, లింగంపల్లి-కాకినాడ టౌన్, విశాఖ-తిరుపతి, సికింద్రబాద్- విశాఖ రైళ్లకు అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సాధ్యమైనంత త్వరలో ఈ రైళ్లు పట్టాలు ఎక్కనున్నాయి. ఆయా రైల్వే జోన్ల నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకు రైల్వేశాఖ ఈ రైళ్లు నడిపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే త్వరలోనే ఆయా రైళ్లు ప్రారంభమైయ్యే తేదీ, టికెట్ల బుకింగ్ అందుబాటులోకి వచ్చే తేదీని రైల్వేశాఖ ప్రకటించనుంది.

Railway Board approval to zones for 39 new trains

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News