Tuesday, July 2, 2024

గుడ్ న్యూస్ అందించిన రైల్వే శాఖ

- Advertisement -
- Advertisement -

రైల్వే ఉద్యోగాల కోసం కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ అందించింది. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో 5,696 అసిస్టెంట్ లోకో పైలట్(ఏఎల్‌పి) పోస్టుల భర్తీకి రైల్వేశాఖ నోటిఫికేషన్ విడుదల చేయగా అందులో దక్షిణమధ్య రైల్వే పరిధిలో 1,364 పోస్టులను భర్తీ చేస్తున్నట్టు రైల్వే శాఖ తెలిపింది. ఈసారి పోస్టుల సంఖ్యను మూడింతలు పెంచుతూ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు తాజాగా నిర్ణయం తీసుకుంది. తొలుత 5,696 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వగా తాజాగా 18,799 పోస్టులు భర్తీ చేయనున్నట్లు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది. అత్యధికంగా సౌత్ సెంట్రల్ రైల్వే (సికింద్రాబాద్)లో 1,364 పోస్టులు పెరిగాయి.

కాగా, ఇప్పటికే రైల్వే ఉద్యోగార్థులకు వయోపరిమితిని 30 నుంచి 33 వయస్సుకు పెంచిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్లికేషన్ ప్రక్రియ పూర్తి కాగా, జూలై-, ఆగస్టులో సిబిటి-1 పరీక్ష ఉంటుంది. పూర్తి వివరాలకు https://www.rrbcdg.gov.in/ వెబ్‌సైట్‌లో చూడాలని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది. కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని, ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.19,900- రూ.63,200 పే స్కేలు చెల్లిస్తామని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News