Tuesday, September 17, 2024

చిక్కుల్లో నటుడు రాజ్ తరుణ్

- Advertisement -
- Advertisement -

ఎఫ్ఐఆర్ నమోదు

హైదరాబాద్: మాజీ జీవిత భాగస్వామి దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ తో నటుడు రాజ్ తరుణ్ కు చిక్కులు మొదలయ్యాయి. లావణ్యను పెళ్లి చేసుకుంటానని నమ్మించి రాజ్ తరుణ్ మోసం చేశాడని ఆరోపణ. ఇక లావణ్య ‘తిరగబడరా సామి’ అనే సినిమాలో రాజ్ తరుణ్ తో నటించిన నటి మాల్వి మాల్హోత్రా కూడా తనని బెదిరించిందని లావణ్య ఇదివరకే పిటిషన్ వేసింది.

ఇదిలావుండగా నార్సింగి పోలీసులు కేసు బుక్కయిందని మీడియాకు తెలిపారు. లావణ్యను మోసగించినందుకు రాజ్ తరుణ్ పై కేసు బుక్ చేసినట్లు తెలిపారు. ‘‘పెళ్లి చేసుకుంటానని నమ్మించి రాజ్ తరుణ్ చాలా కాలం నాతో కలిసి జీవించాడు, కానీ చివరికి మోసం చేశాడు. ఇప్పుడు అతడు నటి మాల్వి మాల్హోత్రాతో వ్యవహారం నడుపుతున్నాడు. నన్ను మాల్వి, ఆమె సోదరుడు, ఇతరులు బెదిరిస్తున్నారు’’ అని లావణ్య తెలిపింది. పోలీసులు విషయాన్ని స్పష్టం చెప్పమని అడిగినప్పుడు ఆమె రాత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి వంచించాడని పేర్కొంది. దీనిపై తగిన సాక్ష్యాధారాలుంటే తప్పక చర్య తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

ఇదిలావుండగా లావణ్య టివి9 తో మాట్లాడుతూ విషయాన్ని వివరించింది.తాము  రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు మూడు నెలల తర్వాత ఇరు కుటుంబ సభ్యులకు తెలిపామంది. తమ పెళ్లి గురించి ఇరు కుటుంబాలకు తెలుసునని, కానీ రాజ్ తరుణ్ గత సెప్టెంబర్ నుంచి తనను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాడని లావణ్య పేర్కొంది. తాము గత 11 నుంచి 15 ఏళ్లుగా కలిసి ఉంటున్నామని కూడా పేర్కొంది.

‘‘నేనతడి నుంచి డబ్బును కోరుకోవడం లేదు. అతడి వద్ద డబ్బు లేని కాలం నుంచే అతడు నాకు తెలుసు. మాల్వి కోసమే అతడు నన్ను వదిలేశాడు. నాకు మస్తాన్ అనే వ్యక్తి తెలుసునన్నది నిజం. డ్రగ్స్ కేసులో నేను జైలుకెళ్లానన్నది(ఈ ఏడాది జనవరిలో) కూడా నిజం. కానీ ఆ డ్రగ్స్ వ్యవహారంతో నాకు సంబంధమే లేదు’’ అని లావణ్య వివరించింది.

ఇదిలావుంటే లావణ్యతో తనకు సంబంధం ఉన్నదన్నది నిజమేనని, కానీ తానామెను పెళ్లాడలేదని రాజ్ తరుణ్ వాదిస్తున్నాడు. లావణ్యతో 2011 నుంచి 2017 వరకు సంబంధం కొనసాగించినట్లు చెబుతున్నాడు. తర్వాత తమ మధ్య సంబంధంలేదని అంటున్నాడు. ఆమెకు మస్తాన్ అనే వ్యక్తితో సంబంధం ఉందని అంటున్నాడు. మాల్వి ముంబైలో ఉంటుందని, తాను హైదరాబాద్ లో ఉంటున్నానని, అలాంటి తమ మధ్య వ్యవహారం ఎలా?.. అని వాదిస్తున్నాడు.

మరోవైపు నటి మాల్వి ప్రెస్ తో మాట్లాడుతూ ‘‘ నేను లావణ్యపై ఫిర్యాదు చేశాను. నా వైపు కథనాన్ని తెలిపాను. ఆమె నా శీల హననం చేస్తోంది. నాకు రాజ్ తరుణ్ తో ఎలాంటి సంబంధం లేదు. 8 నెలలుగా మేము అసలు మాట్లాడుకోవడం లేదు. నా కుటుంబం హిమాచల్ ప్రదేశ్ లో నివసిస్తుంది. లావణ్య నా కుటుంబాన్ని బెదిరిస్తోంది.నా సోదరుడికి వ్యతిరేకంగా ఫిర్యాదు నమోదు చేసింది. నాకు వారి వ్యక్తిగత జీవితంతో సంబంధం లేదు. నా మానాన నన్ను వదిలేయండి. నేను నా తొలి తెలుగు సినిమా చేశానంతే. ఆమె (లావణ్య) నా ప్రతిష్ఠను మంటగలుపుతోంది’’ అని చెప్పకొచ్చింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News