Sunday, February 23, 2025

రాజశ్యామల యాగం ఎవరి కోసం: భాను ప్రకాశ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎవరి కోసం సిఎం జగన్ మోహన్ రెడ్డి రాజశ్యామల యాగం చేశారని బిజెపి నేత భాను ప్రకాశ్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కుటుంబం బాగుండాలని దేవదాయ శాఖ డబ్బుతో యాగంతో చేస్తారా? అని ప్రశ్నించారు. ప్రజలు ఎలా పోయినా సిఎంకు పరవా లేదా? అని అడిగారు. గురువారం సిఎం తీసుకున్న సంకల్పం వింతగా ఉందని, ఇలాంటి విధానం తామెప్పుడూ చూడలేదని, వినలేదని, దేవదాయ శాఖ మంత్రి సమాధానం చెప్పాలని నిలదీశారు. వ్యక్తిగత లబ్ధి కోసం ప్రజల సొమ్ము దుర్వినియోగం చేస్తారా? అని అడిగారు. ఎక్కడి నుంచి ఎంత నిధులో తీసుకొచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.

Also Read: వేసవి తాపం…. స్కూటర్‌పై యువజంట స్నానం (వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News