Saturday, April 26, 2025

ఒకే కుటుంబంలో నలుగురిని చంపి… తగలబెట్టారు

- Advertisement -
- Advertisement -

జైపూర్: ఒకే కుటుంబంలో నలుగురిని చంపి అనంతరం ఇంటి ముందు మృతదేహాలపై పెట్రోల్ పోసి తగలబెట్టిన సంఘటన రాజస్థాన్ రాష్ట్రం జోధ్‌పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. చెరాయ్ గ్రామంలో ఆరు నెలల పసికందుతో పాటు మరో ముగ్గురిని గుర్త తెలయని వ్యక్తులు హత్య చేశారు. అనంతరం మృతదేహాలను బయటకు తీసుకొచ్చి తగలబెట్టి అక్కడి నుంచి పారిపోయారు. ఇంటిని కూడా తగలబెట్టారు. గ్రామస్థులు అక్కడి చేరుకొని మంటలను ఆర్పేశారు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జోధ్‌పూర్ ఎస్పి ధర్మేంద సింగ్ యాదవ్ అక్కడికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఇది ప్రతీకార హత్య అని పోలీసులు వెల్లడించారు.

Also Read: కృత్రిమ ఆహార సంక్షోభం!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News