- Advertisement -
జైపూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా సవాయ్ మాన్సింగ్ స్టేడియం వేదికగా.. రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకూ ఐదు మ్యాచులు ఆడిన బెంగళూరులు మూడు మ్యాచుల్లో విజయం సాధించింది. ఇక రాజస్థాన్ కూడా ఐదు మ్యాచులలో 2 మ్యాచుల్లో నెగ్గింది. దీంతో ఈ మ్యాచ్ విజయం ఇరు జట్లకి కీలకంగా మారింది. ఈ మ్యాచ్లో బెంగళూరు గత మ్యాచ్లో ఆడిన జట్టునే కొనసాగిస్తుండగా.. రాజస్థాన్ ఒక మార్పు చేసింది. ఫరూఖీ స్థానంలో వనిందు హసరంగాని జట్టులోకి తీసుకుంది.
- Advertisement -