Saturday, October 5, 2024

రాజ్‌కోట్ గేమింగ్ జోన్ విషాదం… టౌన్ ప్లానింగ్, ఫైర్ ఆఫీసర్లపై విచారణ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రాజ్‌కోట్ గేమింగ్ జోన్ విషాద సంఘటనకు సంబంధించి టౌన్‌ప్లానింగ్, ఫైర్ ఆఫీసర్లను అదుపు లోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ విషాద సంఘటనలో తొమ్మిది మంది పిల్లలతోసహా మొత్తం 27 మంది మృతి చెందారు. రాజ్‌కోట్ మునిసిపల్ కార్పొరేషన్‌కు చెందిన టౌన్‌ప్లానింగ్ ఆఫీసర్ ఎండి సగాథియా, ఫైర్ ఆఫీసర్ బిజె థెబాలను రాజ్‌కోట్ క్రైమ్ బ్రాంచ్ అదుపు లోకి తీసుకుంది.

ఎలాంటి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లేకుండా కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ లైసెన్స్‌పై ఎలా ఈ గేమింగ్‌జోన్ నిర్వహించడానికి వీలు కల్పించారని , తదితర కీలకమైన ప్రశ్నలతో వీరిని విచారించనున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో మొత్తం ఐదుగురు అరెస్ట్ కాగా, వారిలో నలుగురు ఈ గేమింగ్‌జోన్ యజమానులు ఉన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News