ప్రస్తుతం టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్ల లిస్ట్ తీస్తే అందులో తప్పనిసరిగా రష్మిక మందన్న పేరు ఉంటుంది. ఈ ఏడాది మొదట్లోనే మహేష్ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’తో బ్లాక్బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న ఈ సినిమా రష్మిక కెరీర్ను ఓ మలుపు తిప్పుతుందనే అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా రష్మిక చాలాకాలం క్రితం ఓ తమిళ సినిమా ఒప్పుకుంది. కార్తి హీరోగా ‘సుల్తాన్’ అనే టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమాలో రష్మిక ఓ క్రీడాకారిణిగా నటిస్తోందని సమాచారం.
ఓ అథ్లెట్ క్యారెక్టర్లో ఆమె కనిపిస్తుందని అంటున్నారు. ఇలా క్రీడాకారిణిగా నటించడం రష్మికకు ఇది మొదటిసారేమీ కాదు. ఎందుకంటే విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’లో ఈ బ్యూటీ ఓ క్రికెటర్గా నటించింది. ఆ సినిమాలో రష్మిక క్రికెటర్ పాత్రకు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు మరోసారి ఇలా అథ్లెట్గా నటిస్తుండడం ఆసక్తిని కలిగిస్తోంది. ఈ సినిమా రష్మికకు కోలీవుడ్ డెబ్యూ కావడం విశేషం. కార్తి నటించిన సినిమాలన్నీ తెలుగులోకి వస్తుంటాయి కాబట్టి ఈ సినిమా కూడా తెలుగులోకి రావడం ఖాయమే. ఈ సినిమాకు బక్కియరాజ్ కన్నన్ దర్శకుడు. వివేక్ – మెర్విన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డ్రీమ్ వారియర్ బ్యానర్పై ఎస్.ఆర్. ప్రభు నిర్మిస్తున్నారు.