- Advertisement -
హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న వారికే రేషన్, పెన్షన్ ఇవ్వనున్నట్లు తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు(డీహెచ్) శ్రీనివాసరావు తెలిపారు. నవంబర్ 1 నుంచి రాష్ట్రంలో దీన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు చెప్పారు. డిసెంబర్ చివరి వరకు రాష్ట్రంలో వందశాతం కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో ప్రభుత్వం రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ను మరింత వేగవంతం చేసేందుకు సిద్ధమైంది. ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ తీసుకునేలా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా వ్యాక్సిన్ తీసుకోని వారికి రేషన్, పెన్షన్ బంద్ చేయనున్నట్లు డీహెచ్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
Ration band if not taken corona vaccine: DH Srinivas Rao
- Advertisement -