- Advertisement -
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో బెంగళూరు జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బెంగళూరు సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో ఈ రెండు జట్లు తలపడిన మ్యాచ్లో ఢిల్లీ విజయం సాధించింది. దీంతో ఢిల్లీ సొంత గడ్డపై విజయం సాధించాలని బెంగళూరు భావిస్తోంది. ఇక ఢిల్లీ ఈ మ్యాచ్లోనూ బెంగళూరుకు అవకాశం ఇవ్వకుండా విజయం సాధించేందుక కృషి చేస్తోంది. ఈ మ్యాచ్లో బెంగళూరు జట్టులో ఒక మార్పు చేసింది. సాల్ట్ స్థానంలో బెతెల్ని జట్టులోకి తీసుకుంది. ఢిల్లీ విషయానికొస్తే.. డుప్లెసిస్ తిరిగి జట్టలోకి వచ్చాడు.
- Advertisement -