Friday, April 25, 2025

ఎన్నికల కేసు నమోదు.. ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన కార్యకర్తలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః ఎలాంటి అనుమతి లేకుండా ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై గాంధీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం… ఐడిహెచ్ కాలనీకి చెందిన మక్కల మహేష్, నర్సింగా రావు కలిసి ఎలాంటి అనుమతి తీసుకోకుండా సనత్‌నగర్ బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. కాలనీలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేశారు.

ఈ సంఘటన ఈ నెల 22వ తేదీన జరగడంతో ఎన్నికల అధికారుల ఫిర్యాదు మేరకు గాంధీ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరికి నోటీసులు జారీ చేశారు. కాగా, బన్సీలాల్‌పేట, సిసి నగర్‌కు చెందిన ఎం. రమేష్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కోట నీలిమాకు సంబంధించిన ఫ్లెక్సీని ఏర్పాట చేశారు. సిసి నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద ఏర్పాటు చేశారు. దీని కోసం ఎలాంటి అనుమతి తీసుకోలేదు. ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన రమేష్‌పై గాంధీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నోటీసు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News