Thursday, October 3, 2024

ఈ నెల 5న పిఎం కిసాన్ నిధులు విడుదల

- Advertisement -
- Advertisement -

వ్యవసాయరంగంలో పెట్టుబడి భారాన్ని తగ్గింకే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పధకం కింద ఈ నెల 5న నిధులు విడదల చేయనుంది. ఖరీఫ్ పంటకాలానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 18వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన నిధులను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. ఈ పధకం ద్వారా దేశంలో మొత్తం 9 కోట్ల మంది పైగా రైతులకు లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే రైతుల ఖాతాల్లోకి జమకానున్నాయి. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రవేశపెట్టింది. 2019 ఫిబ్రవరిలో ఈ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఈ పధకం ద్వారా రైతులకు పంట సాయంగా ఎకరానికి ఏడాదికి 6 వేల రూపాయలు అందిస్తోంది.

ఈ 6 వేల రూపాయలను ఏటా మూడు దఫాలుగా నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్స్ లో జమ చేస్తూ వస్తోంది. ఏప్రిల్ – జులై తొలి విడతగా, ఆగస్టు- నవంబర్ రెండో విడతగా, డిసెంబర్-మార్చి మూడో విడతగా 2 వేల చొప్పున కేంద్రప్రభుత్వం ఈ ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ఇప్పుటి వరకు పీఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర సర్కార్ 17 సార్లు రైతుల ఖాతాల్లో నిధులు విడుదల చేసింది. ఇప్పుడు 18వ విడత నిధులు విడుదల కోసం ఎదురుచూస్తున్న రైతులకు దసరా ముందు కేంద్రం శుభవార్త చెప్పింది . తాజాగా 18వ దఫా పీఎం కిసాన్ డబ్బులను 2024, అక్టోబర్ 5న ప్రధాని నరేంద్ర మోదీ రిలీజ్ చేస్తారని పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ పేర్కొంది. అదేవిధంగా పీఎం కిసాన్ స్కీమ్ కింద రైతులు రూ. 2 వేలు పొందాలంటే ఇ- కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని అధికారిక వెబ్‌సైట్‌లో సూచించారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా పలుమార్లు దీనిని స్పష్టం చేస్తూనే ఉంది. ఒకవేళ ఇంకా ఎవరైనా ఇ- కేవైసీ చేయించుకోకపోతే వెంటనే పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు .

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News