యాంకర్ శ్యామలకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆమెను అరెస్టు చేయవద్దంటూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ వ్యవహారంలో తనపై పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని శ్యామల హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు శ్యామలను అరెస్టు చేయొద్దంటూ పోలీసులను ఆదేశించింది. సోమవారం నుంచి పోలీసుల ఎదుట హాజరు కావాలని, విచారణకు సహకరించాలని పిటిషనర్ శ్యామలను హైకోర్టు ఆదేశించింది. నిషేధిత బెట్టింగ్ యాప్స్ను ప్రచారం చేసినందుకు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం విదితమే.
ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేశారు. అంతకు ముందు తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని యాంకర్ శ్యామల హైకోర్టును ఆశ్రయించారు. బెట్టింగ్ యాప్ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని ఆమె పిటిషన్ వేశారు. దీనిపై శుక్రవారం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరగనుంది. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినందుకు పంజాగుట్ట పోలీసుస్టేషన్లో శ్యామలపై కేసు నమోదైన విషయం విదితమే. సోషల్ మీడియాలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన కేసులో టివి యాంకర్ విష్ణుప్రియ, సోషల్ మీడియా ఇన్ఫ్లూ యెన్సర్ రీతూ చౌదరిలను పంజాగుట్ట పోలీసులు గురువారం సుదీర్ఘంగా విచారించారు.