ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భారీ ఊరట లభించింది. మల్కాజిగిరి ఎంపిగా ఉన్న సమయంలో నార్సింగి పోలీసుస్టేషన్లో రేవంత్ రెడ్డిపై 2020లో నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. బిఆర్ఎస్ హయాంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్కు చెందిన జన్వాడలోని పామ్హౌస్పై అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేశారంటూ నార్సింగ్ పోలీసులు 2020 మార్చిలో రేవంత్ రెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో అప్పట్లో రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి, 18 రోజులు జైలుకు తరలించారు. అయితే తనపై తప్పుడు కేసు పెట్టారని ఈ ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని 2020 మార్చిలోనే రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయిం చారు. తాజాగా ఇందుకు సంబంధించి మరోమారు హైకోర్టులో విచారణ జరిగింది. జన్వాడ నిషిద్ధ ప్రాంతమేమి కాదని రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాది తెలి పారు. రేవంత్ రెడ్డిపై తప్పుడు సెక్షన్లు నమోదు చేశారని చెప్పారు. మరోవైపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా డ్రోన్ ఎగురవేసిన ప్రాంతం నిషిద్ధ జాబితాలో లేదని తెలిపారు.
ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డిపై నార్సింగి పోలీసు స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ తాజాగా హైకోర్టు ఉత్తర్వులు వెలువ రించింది. మరోవైపు ఈ పిటిషన్ను రద్దు చేయాలని కోరుతూ రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే కొద్దిరోజులకు రేవంత్ రెడ్డి బెయిల్పై విడుదలయ్యారు. అయితే రేవంత్ రెడ్డి పిటిషన్పై హైకోర్టులో పలుమార్లు విచారణ జరిగింది. గత విచారణలో ఈ కేసులో ఫిర్యాదుదారుడు నార్సింగి పోలీస్స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పారు. నాలుగు లైన్ల ఫిర్యాదును పరిశీలిస్తే, రేవంత్ డ్రోన్ క్రికెట్ మైదానం పైన ఎగిరిందని, ఎటువంటి ఫామ్ హౌస్ గురించి ప్రస్తావించలేదని, కెటిఆర్ పేరు లేదా అది ఆయనకు చెందినదా కాదా అని చెప్పలేదని తెలిపారు. అంతేకాకుండా ఈ ప్రాంతం నిషేధిత ప్రాంతం కాదని స్పష్టంగా చెప్పే జీవో ఉందని కూడా తెలిపారు. ఈ క్రమంలోనే జీవో కాపీని అందించాలని, కేసులోని సాక్షుల వాంగ్మూలాలను కూడా సమర్పించాలని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించారు.
రేవంత్ రెడ్డి తరపున హాజరైన సీనియర్ న్యాయవాది టి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఎఫ్ఐఆర్ లోని సెక్షన్లలోని అంశాలు ఏవీ వర్తించకపోయినా, అప్పటి ప్రభుత్వం ఆయనను 20 రోజుల పాటు జైలుకు పంపిందని, ఆ తర్వాత ఆయన బెయిల్ పై బయటకు వచ్చారని తెలిపారు. ఇక, రేవంత్ రెడ్డిపై దాఖలైన కేసులో పోలీసు అధికారుల వాదనను దాఖలు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావును హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. తదుపరి విచారణ కోసం న్యాయమూర్తి కేసును మార్చి 19కి వాయిదా వేశారు.