Tuesday, September 17, 2024

రూ. 1.57 కోట్లు మోసపోయిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి

- Advertisement -
- Advertisement -

ముంబై:  దహిసర్‌కు చెందిన 64 ఏళ్ల రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్‌లో రూ. 1.57 కోట్లు మోసపోయాడని,  కాగా ఈ విషయంలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చేసిన ఫిర్యాదు ప్రకారం, ఆమెను “గోల్డ్ మన్ సాక్స్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్” అనే వాట్సాప్ గ్రూప్‌లో చేర్చారు , నకిలీ యాప్ ద్వారా షేర్ ట్రేడింగ్ , ఐపిఓలలో పెట్టుబడి పెట్టాలని నమ్మించారు.

స్కామర్లు  పెట్టుబడి నిపుణులుగా నటిస్తూ, అసాధారణమైన అధిక రాబడి వాగ్దానం చేసి, ఆమె ఖాతాలో నకిలీ లాభాలను చూపడం ద్వారా ఆమె నమ్మకాన్ని పొందారు. వారు ఆమెను మరింత డబ్బు పెట్టుబడి పెట్టమని బలవంతం చేసారు, చివరికి ఆమె తన నిధులను ఉపసంహరించుకోవడానికి ప్రయత్నించినప్పుడు ప్రతిస్పందించడం మానేశారు.

64 ఏళ్ల మహిళ తాను మోసపోయానని తెలుసుకున్నప్పుడు, ఆమె మోసాన్ని సైబర్ హెల్ప్‌లైన్‌కు నివేదించింది, సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.  దాని తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కాగా సైబర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News