Tuesday, September 17, 2024

న్యూయార్క్‌కు దీటుగా భాగ్యనగరం

- Advertisement -
- Advertisement -

ప్రపంచస్థాయి నగరాల సరసన హైదరాబాద్‌ను నిలబెట్టాలన్నదే ప్రభుత్వ లక్ష్యం
కుష్ మన్ అండ్ వేక్ ఫీల్ సంస్థ ఆసియా పసిఫిక్ సిఈఓతో భేటీ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: సచివాలయంలో సిఎం రేవంత్ రెడ్డితో కుష్ మన్ అండ్ వేక్ ఫీల్ సంస్థ ఆసియా పసిఫిక్ సిఈఓ మ్యాథ్యూ భౌ ప్రతినిధి బృందంతో మంగళవారం భేటీ అయ్యారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో పాటు ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

హైదరాబాద్ గ్లోబల్ సిటీ వృద్ధి చెందుతున్న తీరు, వివిధ రంగాలు విస్తరిస్తున్న తీరుపై ఈ భేటీలో చర్చించారు. గ్రేటర్ హైదరాబాద్ దేశంలోనే శరవేగంగా వృద్ధి చెందుతోందని కుష్మన్ అండ్ వేక్ ఫీల్ కంపెనీ ప్రతినిధి బృందం ఈ సందర్భంగా తమ అధ్యయన వివరాలను పంచుకుంది. గడిచిన ఆరు నెలల్లో రియల్టీతో పాటు లీజింగ్, ఆఫీస్ స్పేస్, నిర్మాణ రంగం, రెసిడెన్షియల్ స్పే స్‌లోనూ హైదరాబాద్ సిటీ గణనీయమైన వృద్ధి నమోదు చేసిందని ఈ బృందం అభిప్రాయపడింది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలకు సంబంధించి ప్రతి ఆరు నెలలకోసారి వెల్లడించే తమ నివేదిక జూలై నెలాఖరులో వెలువడుతుందని తెలిపింది.

తమ ప్రభుత్వం చేపట్టిన మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు, రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు రూట్ విస్తరణతో హైదరాబాద్ మరింత అద్భుతంగా తయారవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తాము దేశంలోని ఇతర నగరాలతో పోటీ పడటం లేదని, హైదరాబాద్‌ను ప్రపంచంలో పేరొందిన నగరాల సరసన నిలబెట్టాలన్నది తమ సంకల్పమని ఆయన అన్నారు. తెలంగాణ నుంచి అమెరికాలో ఉంటున్న వారి సంఖ్య, అక్కడి వెళ్లి వచ్చే వారి సంఖ్య పెరిగిపోయిందని, అందుకే న్యూ యార్క్‌తో పోల్చుకునేలా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాల్సి ఉందని సిఎం అభిప్రాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News