- Advertisement -
మనతెలంగాణ, హైదరాబాద్ : అంబర్పేటలోని సిపిఎల్ గ్రౌండ్లోకి వచ్చిన రెండు పాములను కానిస్టేబుల్ పట్టివేసి జూ అధికారులకు అప్పగించారు. నగర పోలీస్ కమిషనర్ ఇంటికి సమీపంలో రెండు పాములు వచ్చాయి. వెంటనే సిబ్బంది సిపి అంజనీకుమార్కు తెలపడంతో మలక్పేటలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న వెంకటేష్నాయక్కు విషయం తెలిపారు. వెంటనే వచ్చిన వెంకటేష్ నాయక్ రెండు పాములను పట్టాడు. వాటిని తీసుకువచ్చి నగర సిపి అంజనీకుమార్కు కార్యాలయంలో చూపించాడు. పాములను జాగ్రత్తగా పట్టి జూ అధికారులకు అప్పగించిన వెంకటేష్ నాయక్కు మెమోంటో, క్యాష్ రివార్డు ఇవ్వనున్నట్లు సిపి అంజనీకుమార్ తెలిపారు.
- Advertisement -