Saturday, February 22, 2025

జగద్గిరిగుట్టలో రోడ్డు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కూకట్‌పల్లి మండలంలోని జగద్గిరిగుట్టలో సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఉషాముళ్లపూడి వద్ద విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. సికింద్రాబాద్ నుంచి గాజులరామారం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు యాదగిరి(55)గా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News